అగ్ర రాజ్యం అమెరికాలో ఓ వెలుగు వెలుగుతున్న భారతీయులు ఎంతో మంది ఉన్నారు.ఎన్నో ఏళ్ళ క్రితమే అమెరికాలో స్థిరపడి అక్కడ పలు రంగాలలో కీలక పాత్ర పోషితున్నారు అంతేకాదు రాజకీయ రంగంలో కూడా భారతీయులు మనదైన ముద్ర వేస్తున్నారు.
కేవలం విద్యా, వైద్యం, రాజకీయ , వ్యాపార రంగమే కాదు సినిమా రంగంలో కూడా మన వాళ్ళు దూసుకుపోతున్నారు.ఇప్పటికే హాలివుడ్ లో ఎంతో మంది బాలీవుడ్ తారలు నటించన విషయం విధితమే కానీ.
హాలివుడ్ లో నేరుగా అడుగు పెట్టి హిట్స్ మీద హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫేమస్ అయ్యింది మన భారత సంతతి పంజాబ్ యువతి అర్చీ పంజాబీ.తల్లి తండ్రులు గోవింద్, పద్మా లు ఇద్దరూ బ్రిటన్ లో టీచర్స్ గా స్థిరపడా ఆమె మాత్రం యాక్టర్ గా హాలీవుడ్ లో స్థిరపడాలని భావించింది.
ఇంగ్లాండ్ లోని బ్రూనెల్ వర్సిటీలో డిగ్రీ పూర్తీ చేసిన అర్చీ నటనపై ఉన్న మక్కువతో సైరన్ స్పిరిట్ అనే టీవీ సీరియల్ లో మొదటి సారిగా నటించింది.ఈస్ట్ ఈజ్ ఈస్ట్ పేరుతో వచ్చిన హాలివుడ్ సినిమాలో మొదటి సారిగా నటించింది.
ఆ తరువాత వెండితెర అవకాశాల కోసం వెదుకుతూనే బుల్లి తెరపై నటించి మంచి పేరు తెచ్చుకుంది.ఆమె నటించిన సినిమా కాన్ స్టంట్ గార్డెనర్ కు ఆస్కార్ రావడంతో ఆమెకు అవకాశాలు ఎక్కువగా రావడం మొదలయ్యింది.
వచ్చిన ప్రతీ అవకాశాన్ని తన నటనతో అందిపుచ్చుకున్న అర్చీ ఉత్తమ నటి అవార్డు , ఇమేజ్ అవార్డ్ లాంటి పలు అత్యుత్తమ అవార్డ్ లు పొందింది.ప్రస్తుతం వెబ్ సీరీస్ లు చేస్తున్న అర్చీ కు వరుసగా అవకాశాలు వచ్చి పడుతున్నాయి.
ప్రపంచంలో మనం సాధించలేనిది ఏది లేదని సగర్వంగా చెప్తోంది.