ప్రజలు భయపడుతున్నట్లుగానే దేశంలో లాక్డౌన్ విధించకుంటే కరోనా వ్యాప్తి ఆగేలా కనిపించడం లేదు.అందుకే త్వరలో కేంద్రం లాక్డౌన్ పై కీలక నిర్ణయం తీసుకోనుందనే ప్రచారం జరుగుతుంది.
ఇక ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి హద్దులు దాటిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ రాష్ట్రంలో ఏప్రిల్ 26 నుంచి లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది.కాగా రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనా మందిరాలు, పార్క్లు, బ్యూటీ పార్లర్లు, సెలూన్లు, జిమ్లు మూసివేస్తున్నట్లు వెల్లడించింది.
ఈ లాక్డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాల వారు తమిళనాడుకు వెళ్లాలంటే ఈ-పాస్ తప్పనిసరి చేసింది ఇక్కడి ప్రభుత్వం.ఇక దేశంలో అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ బాటపడితే ఆకలి మరణాలు కూడా పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో పాటుగా సంవత్సర కాలంగా ఆదాయ మార్గాలు మూసుకు పోవడంతో పేద మధ్య తరగతి ప్రజలు పడుతున్న కష్టాలకు కరోనా తోడవడం వల్ల పరిస్దితులు చేజారిపోయే అవకాశాలున్నాయని సంకేతాలు వస్తున్నాయట.