రాజశేఖర్, జీవితల ఇద్దరు అమ్మాయిలు హీరోయిన్ లు గా పరిచయం అవ్వాలని ఉవ్విల్లూరుతున్నారు.ఇప్పటికే చిన్నమ్మాయి శివాత్మిక దొరసాని సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకున్నా కూడా మంచి గుర్తింపును శివాత్మిక దక్కించుకుంది.శివాత్మిక కంటే ముందు పెద్దమ్మాయి శివాని ఒక సినిమా లో నటించేందుకు ఓకే చెప్పింది.
షూటింగ్ కూడా జరిగింది.కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది.
తమిళంలో కూడా ఒక సినిమాను ఈమె చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని అది కూడా పట్టాలెక్కినట్లుగా లేదు.
శివాని మొదటి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో చిన్నమ్మాయి శివాత్మిక మూడవ సినిమాను కూడా ప్రకటించింద.
ఇ దొరసాని మొదటి సినిమా కాగా రెండవ సినిమా గా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమాను ఈమె చేస్తున్న విషయం తెల్సిందే.
రంగ మార్తాండ సినిమా లో శివాత్మిక పాత్ర చిన్నగా ఉన్నా కూడా కథలో చాలా కీలకంగా ఉంటుందని అంటున్నారు.ఇక శివాత్మిక మూడవ సినిమా ను అధికారికంగా ప్రకటించారు.
పంచతంత్రం అనే టైటిల్ తో రూపొందబోతున్న ఈ సినిమా లో శివాత్మిక హీరోయిన్ గా కనిపించబోతుంది.ఈ సినిమా లో నిన్నటి తరం హీరోయిన్ స్వాతి కూడా కీలక పాత్రలో కనిపించ బోతుంది.
మెయిన్ లీడ్ గా శివాత్మికనే కనిపిస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.నటనలో తల్లి దండ్రి కి తగ్గ వారసురాలు అనిపించు కునేందుకు వీరిద్దరు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.
ఆ ప్రయత్నాల్లో శివాత్మిక కాస్త పర్వాలేదు కాని శివాని మాత్రం ఇంకా మొదటి అడుగు వేసే వద్దే ఉంది.ఈ అమ్మడు తెలుగు లో మరిన్ని ఆఫర్లు దక్కించుకుంటుందేమో చూడాలి.