మనుషులకు వ్యాధులు అంటుకోవడం తేలికే గానీ అవి వదిలి పోవాలంటే మాత్రం చాలా కష్టం.ముఖ్యంగా కరోనా వైరస్ మహా మొండిగా మారి ప్రజల ప్రాణాలకు సంకటంగా మారింది.
ఇక దేశంలో విసృతంగా వ్యాపిస్తున్న కోవిడ్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్దితులు సాధారణంగా లేవు.కళ్ల ముందు మనుషుల ప్రాణాలను గద్దలా తన్నుకు పోతుంది ఈ మహమ్మారి.
ఈ సెకండ్ వేవ్ వల్ల ఇప్పటికే అన్ని రంగాల ప్రముఖులతో పాటుగా సామాన్య ప్రజలు కూడా ఆందోళన చెందవలసిన పరిస్దితులు నెలకొన్నాయి.ఇకపోతే తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ను కూడా కరోనా పలకరించింది.
ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.కాగా వైద్యుల సూచనల మేరకు తాను చికిత్స తీసుకుంటున్నానని, ఇటీవలే తనతో కాంటాక్ట్లోకి వచ్చిన వారు వెంటనే జాగ్రత్తలు తీసుకుని కరోనా టెస్టు చేయించు కోవాలని ఈ సంధర్భంగా రమేశ్ పోఖ్రియాల్ సూచించారు.