టాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ పరిచయం అందరికీ తెలిసిందే.ప్రస్తుతం వరుస ఆఫర్ లతో దూసుకుపోతుంది.
టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా నిలిచింది.తన గ్లామర్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా బిజీగా ఉంది రకుల్.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది.
2009 లో కన్నడ సినీ పరిశ్రమలో పరిచయం అయిన ఈ బ్యూటీ ఆ తర్వాత టాలీవుడ్ సినిమాకు పరిచయం అయింది.ఇక మొదటి సారి నటనతో గుర్తింపు పొందింది.
ఆ తర్వాత వరుస అవకాశాలను ఓ రేంజ్ లో అందుకుంది.ఇక రకుల్ వర్కౌట్ విషయంలో కూడా తెగ బిజీగా ఉంటుంది.
ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకునే రకుల్ తన హెల్త్ సీక్రెట్లు గురించి సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటుంది.ఇక తాజాగా ఒక విషయం పై షాకింగ్ కామెంట్స్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.
ప్రస్తుతం వేసవి కాలం తీవ్రంగా ఉండటంతో రకుల్ ప్రతిరోజు తన ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ తీసుకుంటుంది.అంతేకాకుండా ఈ విషయం గురించి అభిమానులతో కూడా పంచుకుంటుంది.
ఇక తాజాగా వేసవి తాపం నుంచి తప్పించుకోవడానికి ఓ ద్రావణం గురించి తెలిపింది.వేసవి తాపాన్ని ఎలా తప్పించుకోవాలి అనుకుంటున్నారా అంటూ.
బార్లీ ద్రావణం మిమ్మల్ని రక్షించడానికి ఉందంటూ, తన న్యూట్రిషన్ ఈ ద్రావణం గురించి తనకు సూచించారని, వేసవి కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలను ఈ ద్రావణం దూరం చేస్తుందని రకుల్ తెలిపింది.
అంతేకాకుండా చోట నామ్ బడా కామ్ అంటూ అని ఆ ద్రావణం గురించి కామెంట్ చేసింది.పేరుకి చిన్నగా ఉన్నా దీని పని మాత్రం పెద్దది గా ఉంటుందని ఆ కామెంట్ కు అర్థం.ఇదిలా ఉంటే ప్రస్తుతం రకుల్ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లలో వరుస సినిమాలతో బిజీగా ఉంది.