కరోనా కేసులు ఎక్కువవుతున్న ఈ టైం లో ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం చెబుతుంది.ఇక ఇలాంటి టైం లో స్టేషన్ ఘన్ పూర్ మండలంలోని కోమటిగూడెం కరోనా కేసులు ఎక్కువ వస్తుండటంతో ఆ గ్రామంలో స్వచ్చంధంగా లాక్ డౌన్ ప్రకటించారు.
కోమటిగూడెం లో మండే రోజు 11 కరోనా కేసులు నమోదు అయ్యాయని తెలుస్తుంది.అయితే గ్రామంలో మొత్తం 17 యాక్టివ్ కేసులు ఉండటంతో గ్రామ ప్రజలు మిగతా వారికి ఈ వైరస్ సోకకుండా స్వచ్చంధంగా లాక్ డౌన్ విధించుకున్నారు.
ఒకే వీధిలో 17 మందికి కరోనా రావడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.
వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ లాక్ డౌన్ విధించామని సర్పంచ్ గూడెల్లి అశోక్ చెప్పారి కోమటిగూడెం వీధుల్లో హైడ్రాక్సి క్లోరోక్వీన్ ని పిచికారి చేయించామని తెలిపారు.15 రోజుల పాటు ప్రజలు లాక్ డౌన్ నిభంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం జరిమానా విధిస్తామని చెప్పారు.
అవసరం ఉన్న వారి ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు.సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు బయటకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు.
ఈ ఏడాది తెలంగాణా రాష్ట్రంలో లాక్ డౌన్ లోకి వెళ్లిన గ్రామంగా కోమటిగూడెం నిలిచింది.