తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిన్న కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆయన తన ఫామ్ హౌస్ లోనే క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు.
కాగా కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న కేసీఆర్ త్వరలో కోలుకోవాలని గులాభి నేతలతో పాటుగా, ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
మరోవైపు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రాజకీయ, సినీ ప్రముఖులు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో తాజాగా సినీ నటుడు మోహన్ బాబు కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందించారు.ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే పోరాటయోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడైన గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కరోనా ఏమీ చేయలేదు.
నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆ షిరిడీ సాయినాథుడుని కోరుకుంటున్నాను అంటూ మోహన్ బాబు తన ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు.ఇకపోతే ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ కు నిపుణులైన వైద్య బృందం చికిత్సను అందిస్తున్న సంగతి తెలిసిందే.