రాజకీయ నాయకులు ఏవైతే ఆదేశాలు జారీ చేస్తారో వాటిని వారే ఉల్లంఘిస్తారు.వారిని అడిగే వారు ఉండరు.
ఎందుకంటే వారు పాలించే వారు కాబట్టి అధికారగణం వారి మాటే వింటుంది కాబట్టి.అయితే వారి ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెడతారు.
కొన్ని కొన్ని సార్లు వారి ప్రాణాలకు ముప్పు ఉంటుందన్న విషయాన్ని మర్చిపోతారో ఏమో గాని అలాగే నిర్లక్ష్యంగా వహిస్తుంటారు.అచ్చం ఇలాగే జరిగింది కేసీఆర్ కు అనేది రాజకీయ విశ్లేషకులు బలంగా అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారానికి సంబంధించి హాలియా ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే.అయితే ఇక్కడ మూడు ఘటనలలో ఎక్కడో ఒక చోట కరోనా సోకి ఉండవచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
మొదటిది కేసీఆర్ హాలియా సభకు ప్రచారానికి బయలుదేరే ముందు మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి క్లోజ్డ్ రూం లో సమావేశం నిర్వహించారు.రెండోది కేసీఆర్ సభకు వచ్చే ముందు టీఆర్ఎస్ నేతలు బొకేలు ఇవ్వడానికి కేసీఆర్ వద్దకు వచ్చిన సమయంలో అందరూ మాస్క్ లు లేకుండా వచ్చిన సమయంలో కరోనా సోకి ఉండొచ్చని తెలుస్తోంది.
ఇక మూడోది హాలియా సభ స్టేజీ మీద నోముల భగత్ తో కలిసి చాలా సన్నిహితంగా మాస్క్ లేకుండా మెలిగిన సంగతి తెలిసిందే.అయితే ఈ మూడు ఘటనల్లో ఎక్కడో ఒక చోట కేసీఆర్ కు కరోనా సోకినట్లు తెలుస్తోంది.