తెలుగు సినిమా రంగంలో ఓ అద్భుత నటుడు, అందగాడు శోభన్ బాబు.పలు సినిమాల్లో నటించి టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగాడు.
ఎంతో డబ్బు సంపాదించాడు.నాటి అగ్రహీరోలకు సాధ్యం కాని ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్నాడు.
అయితే.ఆయనపై సినీ రంగంలోఎన్నో విమర్శలు ఉన్నాయి.
ఎంగిలి చేతితో కాకిని కూడా కొట్టడనే అపవాదు ఉండేది.దర్శకనిర్మాతలకు ఎన్నో కండీషన్లు పెట్టేవాడని చెప్పేవారు.
ఆదివారం సినిమా షూటింగులకు రానని చెప్పేవాడట.ఎంత ప్రాధేయ పడినా ససేమిరా అనేవాడట.
ఇవే కాదు.ఇంకా కొన్ని విమర్శలు ఆయనపై వినిపించేవి.
విమర్శల సంగతి ఎలా ఉన్నా.ఆయన చాలా ముందు చూపు ఉన్న వ్యక్తి.
ఆయన మాటలు విని బాగుపడిన వారే తప్ప.నష్టపోయిన వారు లేరట.
ఈ విషయాన్ని ఓ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ చెప్పడం విశేషం. శోభన్ బాబు గురించి అలనాటి మేటి దర్శకుడు కోదండరామిరెడ్డి చాలా విషయాలు వెల్లడించారు.
ఆయన అన్ని విషయాలు బయటపెట్టి డప్పు కొట్టుకునేవాడు కాదన్నారు.తాను ఈ రోజు దర్శకుడిగా మంచి స్థానానికి వచ్చానంటే తన చలువే కారణం అంటారు.
తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయం నుంచి శోభన్ బాబుతో పరిచయం ఉందన్నారు.ఒక దర్శకుడు నన్ను ఎప్పటికీ డైరెక్టర్ కాలేవని చెప్తే.
శోభన్ బాబు తనకు అండగా నిలిచాడని చెప్పారు.ఏ రోజుకైనా తను మంచి దర్శకుడు అవుతాడని బెట్ కట్టినట్లు వెల్లడించారు.
తనకు దర్శకుడిగా అకాశం రావడానికి శోభన్ బాబే కారణం అన్నాడు.
ఆయన మాటలు వినడం వల్లే ఇప్పుడు తాను సంతోషంగా ఉన్నట్లు చెప్పాడు.చెన్నైలో ఓ నిర్మాత తన స్థలాన్ని అమ్మాలనుకున్నాడు.సిటీకి దూరంగా ఉండటంతో మిత్రులు వద్దని సలహా ఇచ్చారట.
కానీ శోభన్ బాబు కొనమని చెప్పారట.నువ్వు కొనకపోతే నేను కొంటాను అన్నాడట.
ఆ ప్రాంతం భవిష్యత్ లో బాగా డెవలప్ అవుతుందని చెప్పాడట.ఆయన మాటలు నమ్మి కొన్న భూమి ఇప్పుడు కోట్ల రూపాయలు పలుకుందని చెప్పాడు.
దాంట్లో కాంప్లెక్సు కట్టి అద్దెకు ఇస్తే నెలకు లక్షలు వస్తున్నాయట.దాంతో సంతోషంగా ఉన్నామని కోదండరామిరెడ్డి చెప్పారు.
తన సంతోషం అంతా శోభన్ బాబు చలువే అంటారు ఆయన.