రాజకీయాలు అంటే ఎన్నో వ్యూహ ప్రతి వ్యూహాల సమాహారం అని తెలిసిన విషయమే.అయితే రాజకీయ నాయకులు వేసే కొన్ని వ్యూహాలు ఇతర పార్టీలను సంకటం లోకి నెట్టేస్తాయి.
అయితే తాజాగా కేటీఆర్ వేసిన ఈ వ్యూహం బీజేపీలో పెద్ద ముసలాన్నే రాజేసిందనే చెప్పవచ్చు.తాజాగా లింగోజీగూడ కార్పోరేటర్ బీజేపీ తరపున గెలిచిన రమేష్ గౌడ్ చనిపోయిన విషయం తెలిసిందే.
అయితే సాధారణంగా ఒక అభ్యర్థి చనిపోతే మరల అక్కడ ఎన్నిక జరగాలి.కాని బీజేపీ నేతలు చేసిన ఓ పని ఇప్పుడు బండి సంజయ్ ఆగ్రహానికి గురి కావలసి వచ్చింది.
అసలు జరిగింది ఏంటంటే లింగోజీగూడ ఎన్నికకు సంబంధించి ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా సహకరించాలని కోరడం జరిగింది.అయితే బీజేపీ నేతల వినతికి కేటీఆర్ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది.
అయితే ఈ భేటీ సమయంలో కేటీఆర్ ను కలిసిన సమయంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై సంచలన ఆరోపణలు చేసినట్టు తెలిసింది.అయితే ఈ విషయం తెలిసిన బండి సంజయ్ కేటీఆర్ ను కలిసిన ఈ ముగ్గురు నేతలపై బీజేపీ అధిష్టానంపై ఫిర్యాదు చేశారు.
ముగ్గురు నేతలను బీజేపీ పార్టీ నుండి బహిష్కరించాలని కోరారు.ఇప్పుడు కేటీఆర్ వేసిన ఈ ప్లాన్ కు బీజేపీ తగువులాట మొదలయింది.
మరి ఈ వివాదం దేనికి దారి తీస్తుందనేది చూడాల్సి ఉంది.