కేటీఆర్ పెట్టిన ఈ చిచ్చుతో బీజేపీలో ముసలం

రాజకీయాలు అంటే ఎన్నో వ్యూహ ప్రతి వ్యూహాల సమాహారం అని తెలిసిన విషయమే.అయితే రాజకీయ నాయకులు వేసే కొన్ని వ్యూహాలు ఇతర పార్టీలను సంకటం లోకి నెట్టేస్తాయి.

 Musalam In The Bjp With This Chit Put By Ktr Bjp Party, Kt Ramarao,latest Viral-TeluguStop.com

అయితే తాజాగా కేటీఆర్ వేసిన ఈ వ్యూహం బీజేపీలో పెద్ద ముసలాన్నే రాజేసిందనే చెప్పవచ్చు.తాజాగా లింగోజీగూడ కార్పోరేటర్ బీజేపీ తరపున గెలిచిన రమేష్ గౌడ్ చనిపోయిన విషయం తెలిసిందే.

అయితే సాధారణంగా ఒక అభ్యర్థి చనిపోతే మరల అక్కడ ఎన్నిక జరగాలి.కాని బీజేపీ నేతలు చేసిన ఓ పని ఇప్పుడు బండి సంజయ్ ఆగ్రహానికి గురి కావలసి వచ్చింది.

అసలు జరిగింది ఏంటంటే లింగోజీగూడ ఎన్నికకు సంబంధించి ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా సహకరించాలని కోరడం జరిగింది.అయితే బీజేపీ నేతల వినతికి కేటీఆర్ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది.

అయితే ఈ భేటీ సమయంలో కేటీఆర్ ను కలిసిన సమయంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై సంచలన ఆరోపణలు చేసినట్టు తెలిసింది.అయితే ఈ విషయం తెలిసిన బండి సంజయ్ కేటీఆర్ ను కలిసిన ఈ ముగ్గురు నేతలపై బీజేపీ అధిష్టానంపై ఫిర్యాదు చేశారు.

ముగ్గురు నేతలను బీజేపీ పార్టీ నుండి బహిష్కరించాలని కోరారు.ఇప్పుడు కేటీఆర్ వేసిన ఈ ప్లాన్ కు బీజేపీ తగువులాట మొదలయింది.

మరి ఈ వివాదం దేనికి దారి తీస్తుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube