స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మందిని కామన్గా వేధించే సమస్యల్లో ఎసిడిటీ ఒకటి.ఈ సమస్య ఏర్పడినప్పుడు గుండెల్లో మంట, చికాకు, తీవ్రమైన తేన్పులు వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.
ఎసిడిటీ అనేది మరీ పెద్ద సమస్య కాకపోయినా.అసౌకర్యానికి గురి చేస్తుంటుంది.
అందుకే ఈ సమస్యతో తరచూ బాధ పడే వారు ఏ ఆహారం తీసుకోవాలన్నా భయపడిపోతుంటారు.అలాగే ఎసిడిటీని తగ్గించుకునేందుకు తెగ మందులు వాడుతుంటారు.
అయితే ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటించినా ఎసిడిటీ సమస్యను నివారించుకోవచ్చు.ఈ చిట్కాలు ఏంటీ అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ఎసిడిటీకి చెక్ పెట్టడంలో పైనాపిల్ అద్భుతంగా సహాయపడుతుంది.భోజనం తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ పైనాపిల్ రసం తీసుకుంటే తీసుకున్న ఫుడ్ త్వరగా డైజెస్ట్ అయిపోయి.
ఎసిడిటీ సమస్య దరి దాపుల్లో రాకుండా ఉంటుంది.
అలాగే యాపిల్ సిడార్ వెనిగర్ను కూడా ఎసిడిటీ నివారణకు మందుగా ఉపయోగించవచ్చు.
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసుకుని సేవించాలి.ఈ డ్రింక్ తీసుకున్నా ఎసిడిటీ సమస్య దూరం అవుతుంది.
ఎసిడిటీ సమస్యను నివారించడంలో చల్లటి పాలు కూడా చక్కగా సహాయపడతాయి.అవును, ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలను సేవించాలి.
ఇలా చేసినా వెంటనే ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందుతారు.అయితే పాలలో షుగర్ మాత్రం వేసుకోరాదు.
కావాలి అనుకుంటే స్వచ్ఛమైన తేనెను మిక్స్ చేసుకోవచ్చు.
హెవీ మీల్స్ తీసుకున్న వారిలోనే ఎసిడిటీ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
అందువల్ల హెవీ మీల్స్ తీసుకోవడం స్టాప్ చేయండి.అలాగే మద్యం అలవాటు ఉన్న వారిలో, కాఫీని అతిగా తీసుకునే వారిలో, తిన్న వెంటనే నిద్రించే వారిలో ఎసిడిటీ సమస్య కాస్త ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి, ఈ అలవాట్లకు దూరంగా ఉంటే మంచిది.