బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత వరస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.ప్రభాస్ సాహో సినిమా తర్వాత రాధే శ్యామ్ సినిమా చేసాడు.
ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంచాడు.ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.
ఈ సినిమాను జులై 30 న విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమా తర్వాత సలార్, ఆది పురుష్ సినిమాలు ప్రకటించి ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభించేసారు.
ఒకే సమయంలో రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేస్తూ బిజీగా ఉన్నాడు ప్రభాస్.సలార్ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది.
ఆదిపురుష్ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు.
అయితే దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాలో సీత గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు.
ఈ సినిమా కోసం కృతి సనన్ తనను తాను ఎలా మార్చుకుంటుందో తెలిపాడు.
సీత పాత్ర కోసం కృతి స్లిమ్ లుక్ లో ఉండాలనే తిండి కూడా త్యాగం చేసిందట.అంతేకాదు సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పడం కోసం తెలుగు భాష కూడా నేర్చుకుంటుందట.
అందుకోసం ప్రత్యేకమైన నిపుణుడిని కూడా ఏర్పాటు చేసుకుని శిక్షణ తీసుకుంతుందట.చూడాలి మరి కృతి సీత పాత్రలో ఎంత వరకు మెప్పిస్తుందో.