కమర్షియల్ దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్.హరీష్ చివరిగా దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాడు.అయితే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.
దీనికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మొదటి సారి డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది.
ఈ సినిమాని జూన్ లో స్టార్ట్ చేసే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే ఇప్పుడు హరీష్ శంకర్ మరో సినిమాని కూడా కన్ఫర్మ్ చేసుకున్నట్లు తెలుస్తుంది.
హరీష్ శంకర్ షాక్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు.ఆ సినిమాలో రవితేజ హీరోగా నటించాడు.సినిమా సక్సెస్ కాకపోయినా కంటెంట్ ప్రెజెంటేషన్ పరంగా హరీష్ శంకర్ మార్కులు కొట్టేశాడు.ఈ నేపధ్యంలో హరీష్ శంకర్ కి మిరపకాయ్ సినిమాతో రవితేజ మరో అవకాశం ఇచ్చాడు.
ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హరీష్ శంకర్ అందరి దృష్టిని ఆకర్షించాడు.తరువాత ఇద్దరు ఎవరి సినిమాలతో వారు బిజీ అయిపోయారు.
హరీష్ శంకర్ తరువాత రవితేజతో సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్న వర్క్ అవుట్ అవ్వలేదు.అయితే ఇప్పుడు రవితేజకి రీసెంట్ గా హరీష్ శంకర్ ఓ కథని నేరేట్ చేసి ఒకే చేయించుకున్నట్లు తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ తో చేసే సినిమా కంప్లీట్ అయిన తర్వాత రవితేజ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే అవకాశం ఉంది.