సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం లో సర్కారు వారి పాటసినిమా చేస్తున్నాడు.ఈ సినిమా మహేష్ బాబుకు 27 వ సినిమాగా రాబోతుంది.
ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.ఈ సినిమాను పరుశురామ్ సామజిక అంశాలతో తెరకెక్కిస్తున్నాడు.
బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారని సమాచారం.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అయితే మహేష్ ఈ సినిమా తర్వాత రాజమౌళి తో సినిమా చేస్తున్నట్టు ఇప్పటికే ఫిక్స్ అయ్యింది.అయితే రాజమౌళి ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమాకు ఇంకా చాలా టైం ఉంది.
అందుకే మహేష్ ఈ గ్యాప్ లో మరొక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.
ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నట్టు ఇప్పటికే తెలిపారు.వీరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.ఈ సినిమాల్లో అతడు సూపర్ హిట్ అవ్వగాఖలేజా మాత్రం ఆకట్టుకోలేక పోయింది.
అయితే ఈ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి బాగానే ఉంది.ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసాడట.
ఇప్పుడు ఆ కథ ఎలా ఉండబోతుంది అన్న విషయంపై అభిమానులు ఆరా తీస్తున్నారు.అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ కు కథ గురించి ఎలా ఉండాలనేది ఇప్పటికే చెప్పేశారట.
మహేష్ నాకు అల వైకుంఠపురములో సినిమా లాంటి కథే కావాలని చెప్పేశారట.మరి ఇలాంటి సినిమాలు తీయడం త్రివిక్రమ్ కు కొత్తేమి కాదు.ఇక ఈ సినిమా మహేష్ బాబు తండ్రి కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మే 31 న ప్రారంభం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.