షర్మిల పార్టీ పై సంచలన కామెంట్స్ చేసిన కొడాలి నాని..!!

ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తిరుపతి ఉప ఎన్నిక గురించి కీలక కామెంట్ చేశారు.తిరుపతి ఉప ఎన్నికల్లో కేవలం 50 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైందని.

 Kodali Nani Sensational Comments On Sharmila Tirupati By Election, Kodali Nani,-TeluguStop.com

ఎక్కడా కూడా దొంగ ఓట్లు పడలేదని పేర్కొన్నారు.నిజంగా దొంగ ఓట్లు పడి ఉంటే.

పోలింగ్ శాతం 80 నుండి 90 వరకు నమోదు అయి ఉండేది అని స్పష్టం చేశారు.కానీ అటువంటి జరగలేదని పేర్కొన్నారు.

కచ్చితంగా ఉప ఎన్నికలలో వైసీపీ పార్టీ నాలుగు లక్షలకు పైగా మెజార్టీ సాధించడం గ్యారెంటీ అని స్పష్టం చేశారు.ఇదే తరుణంలో రాష్ట్రంలో కరోనా నియంత్రణ అనేది లాక్ డౌన్ వల్ల మాత్రమే కాదని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎక్కడికక్కడ మాస్కులు ధరిస్తూ .సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ శుభ్రంగా శానిటైజర్ వాడాలని సూచించారు.ఈ క్రమంలో తెలంగాణ లో తమ పార్టీ గురించి దృష్టి సారించడం లేదని.షర్మిల పెట్టబోతున్న పార్టీపై ప్రస్తుతం ఏమీ చెప్పలేను అంటూ కొడాలి నాని పేర్కొన్నారు.

కాగా షర్మిల తనదైన శైలిలో తెలంగాణ రాజకీయాలలో దూసుకుపోతూ ఉంది.మూడు రోజుల పాటు తెలంగాణలో నిరుద్యోగుల కోసం దీక్ష చేసి అధికార పార్టీ టిఆర్ఎస్ ను తీవ్ర స్థాయిలో విమర్శించడం జరిగింది.

షర్మిల ఇదే స్పీడుతో కొనసాగితే రాబోయే రోజుల్లో తెలంగాణలో .షర్మిల కొత్త పార్టీ కింగ్ మేకర్ గా మారటం గ్యారెంటీ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube