దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ భారీ స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే.సామాన్యుడి నుంచి సెలబ్రిటీల మరియు రాజకీయ నాయకులు ఎవరిని విడిచి పెట్టడం లేదు అందరూ సమానమే అన్నట్టుగా తనపని తాను చేసుకుంటూ పోతుంది ఈ మహమ్మారి.
ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడ్డారు.ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారికంగా ప్రకటించడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా ప్రస్తుతం కేసీఆర్ కి ప్రత్యేక వైద్యు బృందం సమక్షంలో ఆయన ఫాంహౌస్ లోనే చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.ఈ విషయం తెలియగానే టిఆర్ఎస్ పార్టీ నేతలు మరియు కార్యకర్తలు.
తమ అధినాయకుడు కోలుకోవాలని భగవంతునికి ప్రార్థనలు స్టార్ట్ చేశారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం.
క్షేమంగానే ఉన్నట్లు సమాచారం.తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఇప్పటికే విద్యా సంస్థలు మరియు పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది.మరోపక్క హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని మరిన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు ఇటీవల ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
.