దేశంలో కరోనా తన విశ్వరూపాన్ని చూపిస్తుంది.గత సంవత్సరం ఇండియాలోకి చైనా నుండి ప్రవేశించిన కరోనా ప్రస్తుతం పోయిన ఏడాది తన కొరలకు చిక్కని వారి లిస్టు తయారు చేసుకున్నట్లుగా కనిపిస్తుంది.
ఈ క్రమంలో రాజకీయ, సినీ రంగాల ప్రముఖులందరిని తన ఖాతాలో వేసుకుంటుంది.ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ దిశగా అడుగులు వేస్తుండగా, దాదాపుగా ఈ వైరస్ వల్ల హస్పటల్లో బెడ్స్ అన్నీ నిండిపోయాయి.
అంటే ప్రస్తుతం మరో పెద్ద కోవిడ్ సంక్షోభం ముంచుకొస్తుందని అర్ధం అవుతుంది.
గత ఏడాది మిగిల్చిన చేదు జ్ఞాపకాలనే మరచిపోని ప్రజలు, దానికంటే ఎక్కువ కష్టాలను ఈ సంవత్సరం చూపిస్తుండటం జీర్ణించుకోలేక పోతున్నారట.
ఇక ప్రభుత్వ వైఫల్యం అయితే నేమి, ప్రజల నిర్లక్ష్యం అయితేనేమి.దేశం మాత్రం ప్రస్తుతం వల్లకాడులా మారుతుంది.
ఇదిలా ఉండగా తాజాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యిందని సమాచారం.ఈ క్రమంలో దిల్లీలోని ఎయిమ్స్లో మన్మోహన్ చేరారట.
ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.