కరోనా బారిన పడిన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్.. !?

తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందడి ముగిసిందని ఊపిరి పీల్చుకుంటున్న నేతలకు ఊహించని షాక్ తగిలింది.ఎలాగైనా ఈ ఉప ఎన్నికలో గెలవాలని తీవ్రంగా శ్రమించారు నేతలు.

 Trs Candidate Nomula Bhagath Infected Corona Virus , Telangana, Nagarjuna Sagar-TeluguStop.com

అందులో కోవిడ్ నిబంధనలు పక్కన పెట్టి, మాస్కులు కూడా ధరించకుండా ప్రచారంలో పాల్గొన్నారు.కానీ కరోనా చూస్తూ ఊరుకుంటుందా దొరికిన వారిని దొరికినట్లుగా కుమ్ముకుంది.

నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కరోనా పంజా విసిరింది.ఈ క్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కరోనా బారినపడినట్టు విశ్వనీయ వర్గాల సమాచారం.ఇదే క్రమంలో పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలతో పాటుగా అధికార పార్టీ ముఖ్య నేతలకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందట.

కాగా పోలింగ్ కారణంగా కరోనా కేసులు పెరిగినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు.

ఇకపోతే ఇప్పటి వరకు సాగర్ నియోజకవర్గంలోని పెద్దపూరలో 59, హాలియాలో 66, గుర్రంపోడులో 11, నిడమనూర్‌లో 7, సాగర్‌లో 17 కేసులు నమోదు అవగా, కేవలం సాగర్ పరిధిలో మొత్తం 160 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube