ఎన్టీఆర్ ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొక వైపు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ద్వారా మన ముందుకు రాబోతున్నాడు.ఎన్టీఆర్ షో చేయడం కొత్తేమి కాదు ఇంతకు ముందు బిగ్ బాస్ షో లో వ్యాఖ్యాతగా వ్యవహరించి తన యాంకరింగ్ కు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు వేయించుకున్నాడు.
అసలు మన తెలుగులో బిగ్ బాస్ హిట్ అవ్వడానికి కారణమే ఎన్టీఆర్.
జెమిని టీవీలో ప్రసారం కాబోతున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షో మే లో మొదలవబోతుందని తెలిసిందే.
కానీ కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యి ఇంతకు ముందు కన్నా ఎక్కువగా వ్యాపిస్తుంది.ఇప్పటికే చాలా సినిమాలు కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్నాయి.సినిమా విడుదల తేదీలను కూడా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు.అయితే ఇప్పుడు ఎన్టీఆర్ చేయబోయే ఎవరు మీలో కోటీశ్వరులు షో కూడా కరోనా కారణంగా వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి.
మే లో మొదలవ్వాల్సిన ఈ షో జూన్ నెల వరకు పోస్ట్ ఫోన్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది.ఎప్పుడు ఈ షో కోసం లక్షల మంది పోటీ పడేవారు.కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.కరోనా భయంతో ఎక్కువ మంది ఈ షో లో పాల్గొనడానికి ఆసక్తిగా లేరట.వేళల్లో రావాల్సిన అప్లికేషన్లు వందల్లో కూడా రాలేదని అందుకే ఈ షో ను జూన్ కు వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయట.
అయితే ఇప్పటికే ఈ షో ప్రోమోస్ కూడా విడుదల చేసారు.
అంతేకాదు మొదటి క్వశ్చన్ కూడా జెమిని టివి లాక్ చేసింది.కానీ పరిస్థితి చేయిదాటి పోవడం వల్ల ఈ షో వాయిదా వేయక తప్పడం లేదట.
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు.