ప్రపంచ ధనవంతుల్లో ఎంతో మంది భారతీయులు చేరిపోయారు.గతంలో అత్యంత ధనవంతులు ఉన్న నగరాల్లో ఢిల్లీ, ముంబై మాత్రమే ఉండేది.
గత 15 ఏండ్లలో ఢిల్లీతో పాటు ముంబైలో ధనవంతుల సంఖ్య 300 శాతం పెరిగినట్లు నివేదికలు వెల్లడించాయి.తాజాగా ఢిల్లీ, ముంబై సరసన హైదరాబాద్ చేరింది.
పలువురు తెలుగు వారు సైతం ప్రపంచ ధనవంతుల లిస్టులో చేరారు.ఇంతకీ ఆ అత్యంత ధనవంతులైన తెలుగు వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
లగడపాటి మధుసూదన్ రావు ఈయన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సోదరుడు.లాంకో ఇన్పోటెక్ చైర్మన్.ఈయన ఆస్తి 2.3 బిలియన్ డాలర్లు
మురళీ దివి
ఇతడు దివీస్ లేబొరేటరీ అధినేత.ఈయన మొత్తం ఆస్తి విలువ 2.1 బిలియన్ డాలర్లు
అంజిరెడ్డి కె
ప్రపంచ ప్రఖ్యాత రెడ్డీస్ ల్యాబ్ అధినేత.ప్రపంచ ఫార్మా రంగంలోనే తన కంటూ ఓ గుర్తింపు పొందింది ఈ ల్యాబ్.తన సేవలకు గుర్తింపుగా 2001లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.ఈయన ఆస్తి 1.5 బబిలియన్ డాలర్లు.
జి వి క్రిష్టారెడ్డిః
ఈయన ఇన్ ఫ్రా రంగంలో రారాజుగా వెలుగుతున్నారు.జీవీకే సంస్థ ద్వారా ఏన్నో భారీ ప్రాజెక్టులు చేపట్టారు.దేశంలోనే ప్రముఖ విమానాశ్రయాలు, జాతీయ రహదారులు సహా పలు బారీ ప్రాజెక్టులు చేపట్టారు.ఈయన ఆస్తి విలువ 1.3 బిలియన్ డాలర్లు.
జి ఎం రావు
ఈయన జీఎంఆర్ గ్రూప్ అధినేత.ఇన్ ఫ్రా రంగంలో దూసుకుపోతున్నారు.తన ఆస్తి విలువ 1 బిలియన్ డాలర్లు.
మొత్తంగా తమ భారీ ప్రాజెక్టులతో భారీగా డబ్బు సంపాదిస్తూ.హైదరాబాద్ పేరును ప్రపంచ దేశాల్లో మార్మోగేలా చేస్తున్నారు ఈ బిజినెస్ దిగ్గజాలు.వీరితో పాటు పలువురు వ్యాపార వేత్తలు సైతం అత్యంత ధనవంతుల లిస్టులో ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు.