రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా తనని తాను ఎలివేట్ చెసుకునే పనిలో ఉన్నాడు.
యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మాఫియా కథాంశంతోనే పూరీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కోసం జాకీచాన్ సినిమాలకి యాక్షన్ కొరియోగ్రాఫర్ గా చేసిన వ్యక్తిని రంగంలోకి దించారు.దీనిని బట్టి ఇందులో ఫైట్ సీక్వెన్స్ ఏ రేంజ్ లో ప్రెజెంట్ చేయబోతున్నారో తెలుస్తుంది.
లైగర్ సినిమాతో బాలీవుడ్ లో కూడా పాగా వేయాలని విజయ్ దేవరకొండ గట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు.ఇదిలా ఉంటే ఆ మధ్య సుకుమార్ విజయ్ దేవరకొండతో ఒక పాన్ ఇండియా సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు.
ఈ సినిమా సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని, ఇందులో విజయ్ దేవరకొండ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా కనిపిస్తాడని ఆ మధ్య టాక్ నడిచింది.ఈ సినిమాని ఎనౌన్స్ చేయడం అయితే చేశారు కాని ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే విషయాన్ని క్లారిటీ ఇవ్వలేదు.
తరువాత సుకుమార్ పుష్ప సినిమాతో బిజీ అయిపోయాడు.అలాగే విజయ్ లైగర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
దీని తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్ లో విజయ్ ఒక పాన్ ఇండియా మూవీ ఉంటుందనే టాక్ ఉంది.ఈ నేపధ్యంలో సుకుమార్, విజయ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయిందనే టాక్ వినిపించింది.
ఈ నేపధ్యంలో దీనిపై సుకుమార్ క్లారిటీ ఇచ్చాడు.విజయ్ తో తాను ఎనౌన్స్ చేసిన సినిమా ఉంటుందని చెప్పాడు.
అయితే అది వచ్చే ఏడాదిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని కూడా స్పష్టం చేశాడు.దీంతో ఈ కాంబినేషన్ పై వచ్చిన రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది.