వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత మళ్ళీ తెరపై కనిపించి బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సినిమా కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని కూడా అలరించింది.
ముఖ్యంగా మహిళలు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు.కరోనా సెకండ్ వేవ్ కొంత సినిమా కలెక్షన్స్ మీద ప్రభావం చూపించింది.
అయినా కూడా నిర్మాత దిల్ రాజుకి మొదటి వారంలోనే పెట్టిన పెట్టుబడితో పాటు ప్రాఫిట్ కూడా వచ్చేసింది.కేసుల సంఖ్య పెరగడం, అలాగే ఏపీలో టికెట్ రెట్లు తగ్గించడం భారీ కలెక్షన్స్ అయితే డ్రాప్ అయ్యాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాని పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు.కరోనా సోకడంతో ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంటున్నారు.
కరోనా నుంచి రిలీఫ్ అయిన వెంటనే సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది.ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమాని కూడా జూన్ లో సెట్స్ పైకి తీసుకెళ్ళే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే హరీష్ శంకర్ సినిమా గురించి ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మొదటి సారి డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని టాక్ నడుస్తుంది.
పవన్ కళ్యాణ్ తండ్రి కొడుకులు పాత్రలలో సినిమాలో కనిపిస్తాడని, రెండు పాత్రలని రెండు విభిన్నమైన వ్యక్తిత్వాలతో హరీష్ శంకర్ డిజైన్ చేసారని చెప్పుకుంటున్నారు.తండ్రి పాత్ర చాలా పవర్ ఫుల్ గా పొలిటికల్ టచ్ లో ఉంటుందని తెలుస్తుంది.
ఇక కొడుకు పాత్ర కూడా ఎనర్జిటిక్ గా పవర్ ఫుల్ గా డిజైన్ చేసినట్లు బోగట్టా.సోషల్ ఎలిమెంట్ ని తీసుకొని ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఉపయోగించుకొని ఓ పవర్ ఫుల్ మెసేజ్ ని చెప్పే ప్రయత్నం హరీష్ శంకర్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.