అష్టాచమ్మా సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన నాని ఈగ సినిమా తరువాత కెరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.కొన్నేళ్ల పాటు నాని నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి.
భలేభలే మగాడివోయ్ సినిమతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన నాని ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర హిట్ కాలేదు.నాని నటించిన టక్ జగదీష్ ఈ నెల 23వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది.
కరోనా కేసులు తగ్గిన తర్వాతే థియేటర్లలో టక్ జగదీష్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే నాని ప్రస్తుతం టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమా కొరకు ఏకంగా ఆరున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసి సెట్ వేస్తున్నారని సమాచారం.దాదాపు పది ఎకరాల స్థలంలో ఈ సెట్ వేస్తున్నట్టు తెలుస్తోంది.
కరోనా సెకండ్ వేవ్ వల్ల ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో షూటింగ్ లు చేసే పరిస్థితులు లేవు.శ్యామ్ సింగరాయ్ కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా 10 ఎకరాల స్థలంలో కోల్ కతా సెట్ ను వేశారని సమాచారం.పీరియాడికల్ సబ్జెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కనుండగా సాయిపల్లవి, కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.కేవలం సెట్ కోసం ఆరున్నర కోట్లు ఖర్చు చేస్తున్నారనే విషయం తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
నాని ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తోంది.ఈ సినిమాకు వెంకట బోయినపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
పీరియాడికల్ సబ్జెక్ట్ కావడంతో ఈ సినిమా కోసం సెట్ లు ఎక్కువగా అవసరమని తెలుస్తోంది.