పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాల తర్వాత వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా విడుదల అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.
ఈ సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కింది.పింక్ సినిమా రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా డైరెక్టర్ కథలో మార్పులు చేసి తెరకెక్కించాడు.
ఈ సినిమా చుసిన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ ను అభినందిస్తున్నారు.ఒక మంచి సినిమాతో వచ్చాడని పవన్ కళ్యాణ్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
అయితే అంతా బాగుంది అనుకునే లోపే పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడడం అభిమానులకు మింగుడు పడని విషయంగా మారింది.ఈ విషయం తెలుసుకున్నప్పటి నుండి పవన్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు కూడా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కు కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడు కుటుంబ సభ్యులే అతడిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు.కుటుంబ సభ్యులు పవన్ ఆరోగ్యంపై ప్రత్యేక ద్రుష్టి పెట్టారు.పవన్ సన్నిహితులైన డాక్టర్ల తో పాటు అపోలో వైద్యులు కూడా పవన్ కళ్యాణ్ ను పర్వవేక్షిస్తున్నారు.అయితే తాజాగా ఒక విషయం బయటకు వచ్చింది.బాబాయ్ కు కరోనా వచ్చిందని తెలిసి రామ్ చరణ్ తన షూటింగ్ కూడా వాయిదా వేసుకున్నాడని సమాచారం.
ప్రస్తుతం రామ్ చరణ్ ఆచార్య షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
అయితే పవన్ కళ్యాణ్ కు కరోనా వచ్చిందని తెలిసి రామ్ చరణ్ ఆచార్య షూటింగ్ నిలిపివేసి మరి పవన్ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నడని సమాచారం.తన భార్య ఉపాసన తో కలిసి పవన్ ఆరోగ్యం పట్ల కేర్ తీసుకుంటున్నాడట.
పవన్ పూర్తిగా కోలుకున్న తర్వాతే మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేస్తాడని తెలుస్తుంది.