ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా మారింది.చాలా చోట్ల వైరస్ విజృంభణ ఎక్కువగా ఉండటంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు.
ఇక సినీ పరిశ్రమ లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది.ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ లో పలు నటీనటులకు, దర్శక నిర్మాతలకు, సినీ బృందాలకు వైరస్ వ్యాపించగా.
సినిమా షూటింగ్ లను నిలిపివేశారు.
మొదట బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వైరస్ వ్యాపించగా.
ఆ తరువాత వరుసగా నటీనటులందరూ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది.దీంతో వాళ్లంతా సోషల్ మీడియా ద్వారా వైరస్ వ్యాప్తి గురించి తెలుపుతూ ప్రతి ఒక్కరిని జాగ్రత్తలు తీసుకోమని కోరుతున్నారు.
ఇదిలా ఉంటే ఈనెల మొదటి వారంలో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ పాజిటివ్ అని తేలగా.సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
అంతేకాకుండా అతని గర్ల్ ఫ్రెండ్ బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కూడా వైరస్ సోకిన సంగతి తెలిసిందే.ఇక వీరిద్దరూ క్వారంటైన్ లో ఉంటూ వైద్య చికిత్స అందుకోగా.
ఇటీవలే వైరస్ నుండి కోలుకున్నారు.ఇక ఈ విషయం గురించి వారిద్దరూ తమ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో తమకు నెగిటివ్ వచ్చిందని, మీ మనోహరమైన సందేశాలకు ధన్యవాదాలు అంటూ, అందరికోసం తను కూడా ప్రార్థిస్తానంటూ, సురక్షితంగా ఉండండి అని విక్కీ కౌశల్ ఫోటోని షేర్ చేస్తూ తెలిపారు.
ఇక కత్రినా కైఫ్ కూడా తనకోసం కరోనా నుండి కోలుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ.నాకు చాలా ప్రేమ దక్కిందంటూ క్యాప్షన్ ఇవ్వగా తను కూడా ఓ ఫోటో షేర్ చేసింది.
ప్రస్తుతం ఈ జంట కరోనా నుండి బయటపడగా అభిమానుల్లో కాస్త భయం తొలిగింది.మొత్తానికి ఈ జంట ఒక్క రోజు తేడాతో వైరస్ నుండి కోలుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.