బిగ్ బ్యూటీ అషురెడ్డి గురించి తెలియని వారంటూ ఉండరు.ఆమె మా టివిలో ప్రసారమైన బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అషురెడ్డి సోషల్ మీడియాలో ఎప్పడు యాక్టివ్ గా ఉంటుంది.అంతేకాదు.
అషురెడ్డికి యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది.ఆమె ఎప్పుడు యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటుంది.
అయితే ఈ భామకి ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నితిన్ అంటే చాల ఇష్టం.ఇక వీరిద్దరిలో పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి.ఎంతలా అంటే పవన్ కళ్యాణ్ పేరును పచ్చబొట్టు కొట్టించుకుంది.ఇక కొద్దిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ కి నాలుగోవ భార్యగా ఉండి పోతానంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది.
అయితే ఆమె తాజాగా లైవ్ లో కన్నీరు పెట్టుకుంది.ఎందుకో ఒక్కసారి చూద్దామా.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది.ఇక సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్న నటులు సైతం కరోనా బారిన పడుతున్నారు.ఇక ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో దిల్ రాజు, డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అరవింద్ కరోనా బారిన పడిన సంగతి అందరికి తెలిసిందే.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కరోనా బారిన పడ్డారు.
ఇక ఈ విషయం తెలుసుకున్న అషురెడ్డి లైవ్ లో కన్నీళ్లు పెట్టుకుంది.ఇక పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని అషురెడ్డి తెలిపారు.
త్వరలోనే పవన్ పూర్తి ఆరోగ్యంగా ప్రజల ముందుకు వస్తారని ఆమె ఆకాంక్షించారు.
ఇక దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉందని అషురెడ్డి అన్నారు.ప్రతి ఒక్కరు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని అభిమానులకు అషురెడ్డి సూచనలు చేశారు.మిమ్మల్ని నమ్ముకుని కుటుంబాలు ఉన్నాయని జాగ్రత్తగా ఉండాలని అషురెడ్డి ఈ సందర్భాంగా పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా…మరో వైపు అషూ ఏడుపులపై ఎక్కువగా నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు .ఈ పర్ఫామెన్స్ ఏదో కెమెరా ముందు చేస్తే నికి మంచి ఆఫర్లు వస్తాయ్.ముందు నువ్ మాస్క్ పెట్టుకో.నీది నువ్ చూసుకో.నీ ఓవర్ యాక్షన్ ఏంటి అని అషూ రెడ్డిని నెటిజన్స్ నెగటివ్ కామెంట్స్ పెడ్తున్నారు. కొందరు పవర్ స్టార్ పవన్ ఫ్యాన్స్ ఐతే అషూ రెడ్డికి మద్దతు ఇస్తున్నారు.