ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.జనతా గ్యారేజ్ తర్వాత ఈ కాంబోలో రాబోతున్న సినిమా కావడం, అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కబోతూ ఉండటం విశేషం.
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ పెంచుకుంటున్న తారక్ దానిని కొనసాగించే విధంగానే కొరటాల శివ సినిమాని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమాని కళ్యాణ్ రామ్ తో కలిసి కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో ఉన్న కొరటాల దానిని పూర్తి చేసి జూన్, జులై నెలల్లో ఎన్టీఆర్ సినిమాని స్టార్ట్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి అవకాశం ఉందని తెలుస్తుంది.
ఇందులో ఒక హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ భామని తీసుకోవాడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఈ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.
తరువాత కియరా అద్వానీని కూడా పరిశీలిస్తున్నారు.అయితే కియరా హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో సాయీ మంజ్రేకర్ ని తీసుకోవాలని అనుకుంటున్నట్లు బోగట్టా.
ఇప్పటికే ఈ భామ తెలుగులో మేజర్ సినిమాతో పాటు, మెగా హీరో వరుణ్ తేజ్ కి జోడీగా గని సినిమాలో నటిస్తుంది.ఈ రెండు సినిమాల కారణంగా సాయీకి తెలుగులో కూడా అప్పుడే మంచి డిమాండ్ ఏర్పడింది.
ఈ నేపధ్యంలో సాయీ మంజ్రేకర్ తీసుకునే యోచనలో కొరటాల ఉన్నట్లు తెలుస్తుంది.