ఉప్పెన సినిమాతో దర్శకుడుగా పరిచయం అయిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా.ఈ టాలెంటెడ్ దర్శకుడు మొదటి సినిమాతోనే ఏకంగా వంద కోట్ల కలెక్షన్ కొల్లగొట్టి టాలీవుడ్ లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు.అలాగే టాలీవుడ్ లో నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు.ఉప్పెన సినిమాతో మెగా హీరో వైష్ణవ్ తేజ్, కన్నడ భామ కృతి శెట్టి ఒక్కసారిగా టాలీవుడ్ క్రేజ్ సొంతం చేసుకున్నారు.
ఇదిలా ఉంటే బుచ్చిబాబు సానా తన నెక్స్ట్ సినిమాని ఏకంగా ఎన్టీఆర్ తో చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు.ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసుకొని తారక్ కి నేరేట్ చేయడం జరిగిందని సమాచారం.
నాన్నకి ప్రేమతో సినిమా చేసే సమయంలోనే ఎన్టీఆర్ కి బుచ్చిబాబు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కథని వినిపించడం జరిగిందని తెలుస్తుంది.ఇప్పుడు అదే కథని ఎన్టీఆర్ తో చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడానికి ముందుకొచ్చింది.దాంతో పాటు సుకుమార్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం తారక్ ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.దీని తర్వాత వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేస్తారు.
ఈ సినిమా జూన్, జులై లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.ఇది పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతుంది.
తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.అయితే బుచ్చిబాబు సినిమాని ప్రశాంత్ కంటే ముందుగానే చేస్తాడా లేదంటే అతని సినిమా పూర్తి చేసిన తర్వాత వచ్చే ఏడాది ఆఖరున చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.