మన భారత దేశంలో అత్యంత ఆదరణీయమైన క్రీడ క్రికెట్.వయస్సుతో సంబంధం లేకుండా క్రికెట్ ను అన్ని వయస్కుల వారు ఆస్వాదిస్తారు.
ఎంతలా అంటే క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా పూజించే అంత క్రికెట్ వీరాభిమానులు ఉంటారు.అందుకే మన దేశంలో ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నా, ఎంత మంది స్టార్ క్రికెటర్ లు రిటైర్ అయినా భారత క్రికెట్ కు ఏ మాత్రం వన్నె తగ్గడం లేదు.
క్రికెట్ లో టీ 20లు, వన్డే లకు ఎంతో క్రేజ్ ఉన్నా ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ అంతకు మించి ఉంటుందనే విషయం మనకు తెలిసిందే.ప్రస్తుతం ఐపీఎల్- 2021 జరుగుతున్న విషయం తెలిసిందే.
అయితే తమ అభిమాన క్రికెటర్లను సపోర్ట్ చేస్తూ వారి టీం లను సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు.అయితే క్రికెటర్ లు గ్రౌండ్ లో ఎంత విధ్వంసకరంగా మ్యాచ్ ను హోరాహోరీగా ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తారో, మ్యాచ్ అనంతరం కూడా ఫన్నీ వీడియోలతో అభిమానులను మరింతగా ఎంటర్ టైన్ చేస్తుంటారు.
అయితే తాజాగా ఆర్సీబీ కి సంబంధించి టీం బాండింగ్ సెషన్ ను నిర్వహించారు.ఇక ఈ సెషన్ లో టీంలుగా విభజించి ఒక్కొక్కరికి ఒక్కో టాస్క్ ను ఇవ్వడం జరిగింది.
ఇక ఈ స్కిట్ లో విరాట్ కోహ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.తనకు వచ్చిన టాస్క్ లో చిన్న పిల్లాడిలా విరాట్ చిందులేయడంతో అక్కడ మొత్తం నవ్వులు విరిసాయనే చెప్పవచ్చు.
ఇక ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.