సినిమా ఇండస్ట్రీలో కొంతమంది సంవత్సరాల తరబడి ప్రేమించుకుని వేర్వేరు కారణాల వల్ల తర్వాత కాలంలో విడిపోయిన సంగతి తెలిసిందే.అలా విడిపోయిన ప్రేమ జంటల్లో నయనతర ప్రభుదేవా ప్రేమ జంట కూడా ఒకటి.
నయనతార ప్రేమించే సమయానికే ప్రభుదేవాకు పెళ్లైనా ఆమె మాత్రం ప్రభుదేవాను ప్రేమించారు.అయితే ప్రభుదేవాతో బ్రేకప్ కు సంబంధించి చాలాసార్లు ప్రశ్నలు ఎదురైనా ఆమె స్పందించలేదు.
అయితే తాజాగా ఒక సందర్భంలో ప్రభుదేవాతో బ్రేకప్ కావడానికి గల కారణాలను నయనతార వెల్లడించారు.ప్రభుదేవాతో బ్రేకప్ వల్ల లైఫ్ లో ఎన్నో గుణపాఠాలను నేర్చుకున్నానని నయనతార తెలిపారు.
తాను అలా జరగడంతో వ్యక్తిగా చాలా మారానని ఆమె అన్నారు.వ్యక్తులకు దూరమైన తరువాత ప్రతి మనిషిలో మార్పులు జరుగుతాయని అదే విధంగా తనలో కూడా మార్పులు జరిగాయని నయనతార అన్నారు.
లైఫ్ తలకిందులైన విధంగా బ్రేకప్ తర్వాత అనిపించిందని మెంటల్ గా కోలుకోవడానికి తాను సిద్ధమయ్యానని నయనతార తెలిపారు.ఎదురైన సమస్యలను పరిష్కరించుకోవాలని భావించానని ఆమె వెల్లడించారు.
ప్రభుదేవాను ప్రేమించిన తరువాత నయనతార సినిమాలకు కూడా దూరం కావాలని భావించారు. శ్రీరామ రాజ్యం సినిమా తరువాత ఆమె సినిమాలకు దూరమవుతున్నట్టు వార్తలు వచ్చాయి.
అయితే బ్రేకప్ తర్వాత విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడిన నయనతార లేడీసూపర్ స్టార్ గా ఎదగడంతో పాటు వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్నారు.ప్రస్తుతం నయనతార చేతిలో వరుస సినిమా ఆఫర్లు ఉండగా ఆమె ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయల నుంచి 6 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నారని తెలుస్తోంది.ఆమె సినిమాలకు భారీగా మార్కెట్ జరుగుతుండటంతో నిర్మాతలు సైతం ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.ప్రస్తుతం నయనతార ఇతర భాషల కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాల్లో నటిస్తున్నారు.