ఎవరైనా జరిపే లావాదేవిల్లో ఎక్కువగా చెక్బౌన్స్ అవడం వల్ల కలిగే చికాకు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉండదు.ఇలా చెక్బౌన్స్ అయితే చెక్క్ ఇచ్చిన వ్యక్తి పై కేసు ఫైల్ చేయవచ్చూ.
కానీ ఎన్ని సార్లు చెక్బౌన్స్ చేస్తే అన్ని సార్లు కంప్లీంట్ నమోదు చేయవచ్చా అన్నదాంట్లో క్లారీటి లేదు.
అయితే ఇలాంటి వ్యక్తుల విషయంలో సుప్రీంకోర్టు శుక్రవారం పలు మార్గదర్శకాలు జారీచేసింది.
చెక్బౌన్స్ కేసుల్లో విచారణను వేగవంతం చేసే క్రమంలో ఓ వ్యక్తిపై ఒక లావాదేవీకి సంబంధించి ఏడాది కాలంలో నమోదైన వివిధ చెక్బౌన్స్ కేసులన్నింటినీ ఒకే కేసుగా పరిగణించి విచారణ జరుపాలని పేర్కొంది.
ఒక వేళ నిందితుడు నేరం ఒప్పుకొంటే దోషిగా నిర్ధారించేందుకు అధికారాలు కల్పించాలని కోరింది.
అయితే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 258కింద మేజిస్ట్రేటుకు లభించే అధికారాలు చెక్బౌన్స్ కేసులకు వర్తించవని గుర్తు చేసింది.ఇకపోతే చెక్బౌన్స్ కేసుల్లో సాక్షులు ట్రయల్ కోర్టులకు అఫిడవిట్ సమర్పిస్తే సరిపోతుందని నేరుగా విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా పేర్కొన్నది.
ఈ మేరకు నెగొషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టానికి (ఎన్ఐ చట్టం) సవరణలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.కాగా చెక్బౌన్స్ కేసుల సత్వర పరిష్కారానికి తాజాగా సీజేఐ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మార్గదర్శకాలు జారీచేసింది.