ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ ఎంతలా విజ్రుంభిస్తుందో మనం చూస్తున్నాం.ప్రజలు ఇష్టారీతిన సంచారం చేయడం వలన మరల కోవిడ్ కేసులు అన్ని రాష్ట్రాలలో విపరీతంగా నమోదవుతున్నాయి.
ఇక మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాలలో కోవిడ్ కేసులు విపరీతంగా విజ్రుంభిస్తున్న దృష్ట్యా నైట్ కర్ఫ్యూ ను కూడా విధిస్తున్నాయి.అయితే కోవిడ్ నిబంధనలు అందరూ పాటించాలని, లేకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నా కొందరు మాత్రం మారడం లేదు.
ఇష్టారీతిన సంచరించడమే కాకుండా నైట్ కర్ఫ్యూ సమయంలో అసలు బయట తిరగడమే పెద్ద నేరం.కాని నైట్ తిరుగుతూ అంతే కాక రోడ్డు మీద చిందులేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న పరిస్థితి ఉంది.
గుజరాత్ లో తీవ్రంగా కరోనా విజ్రుంభిస్తుండడంతో ప్రభుత్వం జనతా కర్ఫ్యూ విధించింది.అయితే పాయల్బ అలియాస్ ప్రిషా రాథోడ్ అనే 25 ఏళ్ల యువతి రోడ్డు మీద చిందులేస్తూ తన ఇంస్టాగ్రామ్ లో తన డ్యాన్స్ వీడియోను అప్ లోడ్ చేసింది.
అయితే ఈ వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు సదరు యువతిపై కేసు నమోదు చేశారు.అయితే వైరల్ అయిన వెంటనే వీడియోను తొలగించి క్షమాపణలు కోరింది.
ఇక నెటిజన్లు ఈ యువతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రూల్స్ నీకు వర్తించవా అంటూ నెటిజన్లు గరం గరం అవుతున్న పరిస్థితి ఉంది.