ఒక సినిమా ఒకసారి ప్రేక్షకులు మనసుకు హత్తుకుంటే ఇక ఆ సినిమా రికార్డులను కొల్లగొట్టడం ఆపడం ఎవరి తరమూ కాదు.ఆ సినిమా పేరు ఖండాంతరాలు దాటి ఆ సదరు సినిమాలో నటించిన నటులు పరిశ్రమలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు.
ఈ విషయం చాలా సినిమాల ద్వారా రుజువైంది.కొన్ని కొన్ని సార్లు చిన్న సినిమాను తక్కువగా అంచనా వేస్తారు.
కాని అదే సినిమా పెద్ద సినిమాని కూడా దాటేసి రికార్డులు సృష్టించగలదు.అచ్చం ఇప్పుడు జాతిరత్నాలు సినిమా విషయంలోనూ ఇలాగే జరుగుతోంది.
నవీన్ పొలిశెట్టి హీరోగా నాగ్ అశ్విన్ నిర్మాతగా రూపొందిన సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనం చూస్తూనే ఉన్నాం.అల్టిమేట్ కామెడీ సినిమాగా విడుదలైన ఈ సినిమా పెద్ద పెద్ద బ్యానర్ లలో విడుదలైన సినిమాలను ఉదాహరణకు అల్లు అరవింద్ సమర్పణలో వచ్చిన చావు కబురు చల్లగా సినిమా జాతిరత్నాలు దెబ్బకు ఫ్లాప్ పేరు మూటగట్టుకుంది.
అయితే ఈ సినిమా ఎన్నో రకాల వర్గాల నుండి ప్రశంసలను అందుకున్న ఈ సినిమా పై టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ ప్రశంసల వర్షం కురిపించాడు.ఈ సినిమా అద్భుతంగా ఉందని, ప్రతి సీన్ లో నవ్వు ఆపుకోలేక పోయానని, సినిమా బృందానికి అద్భుతమైన సినిమా అందించినందుకు దినేష్ కార్తీక్ ప్రశంసల వర్షం కురిపించాడు.