ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ భారత్లో మనీలాండరింగ్, రుణఎగవేత కేసుల్లో కీలక నిందితుడిగా ఉండి లండన్ పారిపోయిన విషయం తెలిసిందే.ఇక అప్పటి నుండి భారత్కు తిరిగి రాకుండా ఉండేందుకు ఇతను చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.
అందులో భారత్లో తనకు న్యాయం జరగదనీ, కొవిడ్ నేపథ్యంలో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నానంటూ చేసిన దొంగ విజ్ఞప్తులన్నింటినీ కోర్టు తాజాగా కొట్టిపారేసింది.
ఈ క్రమంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడన్న భారత ఆధారాలతో ఏకీభవించిన అక్కడి న్యాయస్థానం భారత్కు అప్పగించే విషయంపై ఆదేశాలు జారీ చేయాలని ఆదేశిస్తూ హోంశాఖకు ఫిబ్రవరిలోనే సూచించింది.
దీంతో నీరవ్ మోదీని భారత్కు రప్పించే ప్రక్రియ దాదాపు దగ్గరపడింది.ఈ నేపధ్యంలో నీరవ్ మోదీని భారత్కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించింది.ఈ మేరకు యూకే హోం సెక్రటరీ ప్రీతి పటేల్ గురువారం సంతకం చేశారు.