నీరవ్‌ మోదీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న బ్రిటన్‌ ప్రభుత్వం.. ?

ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ భారత్‌లో మనీలాండరింగ్‌, రుణఎగవేత కేసుల్లో కీలక నిందితుడిగా ఉండి లండన్‌ పారిపోయిన విషయం తెలిసిందే.ఇక అప్పటి నుండి భారత్‌కు తిరిగి రాకుండా ఉండేందుకు ఇతను చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.

 The British Government Has Taken A Key Decision In The Case Of Neerav Modi, Uk G-TeluguStop.com

అందులో భారత్‌లో తనకు న్యాయం జరగదనీ, కొవిడ్‌ నేపథ్యంలో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నానంటూ చేసిన దొంగ విజ్ఞప్తులన్నింటినీ కోర్టు తాజాగా కొట్టిపారేసింది.

ఈ క్రమంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడన్న భారత ఆధారాలతో ఏకీభవించిన అక్కడి న్యాయస్థానం భారత్‌కు అప్పగించే విషయంపై ఆదేశాలు జారీ చేయాలని ఆదేశిస్తూ హోంశాఖకు ఫిబ్రవరిలోనే సూచించింది.

దీంతో నీరవ్‌ మోదీని భారత్‌కు రప్పించే ప్రక్రియ దాదాపు దగ్గరపడింది.ఈ నేపధ్యంలో నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం అంగీకరించింది.ఈ మేరకు యూకే హోం సెక్రటరీ ప్రీతి పటేల్‌ గురువారం సంతకం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube