తెలుగు బుల్లి తెరపై ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రసారంకు రంగం సిద్దం అయ్యింది.పెద్ద ఎత్తున జెమిని టీవీ వారు ఈ షో కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది.
మొదట అనుకున్న ప్రకారం ఈ నెల చివరి వరకు ప్రారంభం అవ్వాల్సి ఉంది.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జెమిని టీవీ వారు జూన్ కు ఈ షో ను వాయిదా వేశారనే వార్తలు వస్తున్నాయి.
ప్రముఖ స్టార్స్ మరియు అభిమానులు కూడా ఈ షో కోసం ఎదురు చూస్తున్నారు.స్టార్ మా లో గతంలో ప్రసారం అయిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో కు ఇది కాపీ అయినా కూడా ఎన్టీఆర్ హోస్ట్ అవ్వడం వల్ల షో పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి.
షో పై భారీ ఎత్తున అంచనాలున్న నేపథ్యంలో జెమిని టీవీ వారు గతంలో ఏ తెలుగు షో కు ఖర్చు చేయనంత ఈ షో కు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఒక తరహా బాడీ లాంగ్వేజ్ ను ప్రాక్టీస్ చేస్తున్నాడట.
ప్రోమోలో ఇప్పటికే కనిపించి ఆకట్టుకున్న ఎన్టీఆర్ తప్పకుండా షో కు న్యాయం చేస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది.రికార్డు బ్రేకింగ్ టీఆర్పీ రేటింగ్ కోసం జెమిని టీమ్ చాలా పక్కాగా ప్లాన్ చేస్తుంది.
షో లో వచ్చే సెలబ్రెటీల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.కరోనా సెకండ్ వేవ్ కారణంగా షో ను ఆలస్యంగా మొదలు పెట్టాలని జెమిని వారికి ఎన్టీఆర్ చెప్పాడని తెలుస్తోంది.
మరో వైపు ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ కూడా పూర్తి కాలేదు.అందుకే సినిమా చిత్రీకరణ పూర్తి అయిన తర్వాతే ఈ షో ఉంటుందని కూడా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
కనుక జూన్ నెలలో షో ప్రారంభం కాబోతుంది ఫ్యాన్స్ సిద్దంగా ఉండండి.