ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో నిర్వహించిన డిబేట్ కార్యక్రమంలో జడ్జి రామకృష్ణ సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలకు ఆయన ని ఇటీవల మదనపల్లె పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.అమెరికా మానవహక్కుల నివేదిక గురించి చర్చ సందర్భంలో .
చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన జడ్జి రామకృష్ణ సీఎం జగన్ ని ఉద్దేశించి.జగన్ కంసుడిలా తయారయ్యాడు.ఈ రాక్షసుడిని, రాక్షస పాలనను అంతం చేయడానికి.నేను కృష్ణుడిగా భావించి.నరకాసురుడు, కంసుడైనటువంటి జగన్మోహన్రెడ్డిని ఎప్పుడు శిక్షించాలా అని ఎదురు చూస్తున్నాను’ అని జడ్జి రామకృష్ణ అన్నట్లు చిత్తూరు జిల్లా పీలేరు కు వైసీపీ నాయకుడు, మాజీ జడ్పీటీసీ జి.జయరామచంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీలేరు పోలీసు స్టేషన్లో బుధవారం జడ్జి రామకృష్ణపై కేసు నమోదైంది.ఐపీసీ సెక్షన్ 124ఏ కింద పీలేరు పోలీసులు దేశద్రోహం కేసు నమోదుచేశారు.
నిన్న సాయంత్రం ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు పీలేరు కోర్టులో హాజరుపరచగా.ఈనెల 28 వరకు జడ్జి రామకృష్ణకు రిమాండ్ ఆదేశించారు.
దీంతో ఆయనను పీలేరు సబ్ జైలుకు తరలించారు.
.