దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏపీలో జరుగుతోంది.ఒక్క రోజులో 5 వేలకు పైగా కేసులు దాటిపోవడంతో ఏపీలో కూడా పరిస్థితి ఉన్న కొద్దీ ప్రమాదకరంగా మారటంతో సీఎం జగన్ ఈ రోజు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ అయ్యారు.
దీంతో కరోనా కట్టడి చేయడం కోసం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్లతో సమావేశమవుతున్నారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో మరియు అధికారులతో సమావేశం కానున్న జగన్ కరోనా కట్టడి చేయటానికి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో కచ్చితంగా కరోనా నిబంధనలు పగడ్బందీగా పాటించేలా వ్యవహరించి వైరస్ విజృంభణ ఎక్కువగా ఉన్న జిల్లాలలో సరి కొత్త నిబంధనలు అమలు చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల టాక్. ఏది ఏమైనా ఒకపక్క కరోనా కట్టడికి మరోపక్క వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా చేసేలా జగన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాలలో ఎక్కువ కేసులు బయట పడుతూ ఉన్నాయి.ఏది ఏమైనా ఎలాంటి పరిస్థితి వచ్చినా గానీ వైద్యపరంగా కరోనా రోగులకు ఎక్కడ వైద్య సదుపాయం కరవు కాకుండా ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంది.
.