టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రిలియంట్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు సుకుమార్.హిట్ ఫ్లాపులకు కూడా అతీతంగా ఆఫర్లు సొంతం చేసుకుంటున్న సుకుమార్ ప్రస్తుతం పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు.
క్లాస్ సినిమాలను ఎక్కువగా తెరకెక్కించిన సుకుమార్ రంగస్థలం సినిమా నుంచి రూటు మార్చారు.మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా సుకుమార్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.
పుష్ప సినిమా కోసం సుకుమార్ ఏకంగా 25 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.టాలీవుడ్ లో అతికొద్ది మంది దర్శకులు మాత్రమే ఈ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారు.
పుష్ప సినిమాకు సుకుమార్ పాతిక కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటే మాత్రం ఇతర డైరెక్టర్లకు షాక్ ఇచ్చినట్టేనని చెప్పాలి.ఈ సినిమా ఆగష్టు నెల 13వ తేదీన రిలీజ్ కానుంది.
పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుంది.టీజర్ లో కథకు సంబంధించి ఎలాంటి లీకులు ఇవ్వకుండా జాగ్రత్త పడిన సుకుమార్ ట్రైలర్ లో కథను రివీల్ చేస్తారేమో చూడాల్సి ఉంది.మరోవైపు ఈ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుండగా రిలీజ్ డేట్ మార్పుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
ఈ సినిమా కోసం హీరోయిన్ రష్మిక కూడా భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
ఈ సినిమా కోసం రష్మిక ఏకంగా 2 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారని తెలుస్తోంది.
నటించిన సినిమాలన్నీ వరుసగా సక్సెస్ అవుతుండటంతో రష్మిక పుష్ప సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు హిట్టైతే మాత్రం రష్మిక రెమ్యునరేషన్ ను 3 కోట్లకు పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి.