భారతదేశాన్ని కరోనా సెకండ్ వేవ్ కాకా వికలం చేస్తోంది.ఒక్కసారిగా పడగవిప్పినటు రోజుల వ్యవధిలోనే దేశంలో కరోనా విజృంభణ బయట పడుతున్న పరిస్థితులు.
గత ఆదివారం లక్షల వ్యవధిలో కేసులు బయటపడగా గత రెండు రోజుల నుండి రెండు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కావటం ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.ఒకపక్క వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరుగుతున్నదని మరోపక్క బయటపడుతున్న కొత్త కేసులు వల్ల చాలా రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్ళి పోతున్నాయి.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి చోట్ల కరోనా నిబంధనలను చాలా కఠినంగా అమలు చేస్తూ రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి.పరిస్థితి ఇలా ఉండగా దేశంలో మరో రాష్ట్రం వీకెండ్ లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది.
మేటర్ లోకి వెళ్తే రాజస్థాన్ రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వీకెండ్ లాక్ డౌన్ అమలు చేయటానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఇదే బాటలో దేశంలో మరిన్ని రాష్ట్రాలు రాబోయే రోజుల్లో వ్యవహరించనున్నట్లు సమాచారం.
.