తెలంగాణలోని రాజకీయ నాయకులను కరోనా పగబట్టినట్లుగా కనిపిస్తుంది.ఎందుకంటే ఈ మధ్య కాలంలో వరుసగా కోవిడ్ వైరస్ బారిన ఎక్కువగా పొలిటికల్ లీడర్స్ పడుతున్నారు.
ఇలాంటి వారిలో కోలుకున్న వారు తక్కువగా ఉంటే మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది.
ఇకపోతే టీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్(66) కరోనా కారణంగా గురువారం రాత్రి కన్నుమూశారు.
ఈ వైరస్ సోకడంతో అనారోగ్యం పాలైన చందూలాల్ మూడ్రోజుల కిందట హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరారు.
ఈ నేపధ్యంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
కాగా చందూలాల్ మృతిపై రాష్ట్ర గిరిజన నేతలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆయన అభిమానులు, అనుచరులు శోకసంద్రంలో మునిగిపోయారు.ఇకపోతే చందూలాల్ మరణం పై సంతాపాన్ని తెలియచేస్తున్న పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.