ఒకానొకప్పుడు సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ తర్వాత తర్వాత వివాదాస్పద దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు.ఎప్పుడు ఎవరొకరి మీద కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.
ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన దెయ్యం సినిమా ఏప్రిల్ 16 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇందులో రాజేశేఖర్, స్వాతి దీక్షిత్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఇంతకు ముందు ఆర్జీవీ ఇదే పేరుతో జేడీ చక్రవర్తి, మహేశ్వరీ ప్రధాన పాత్రల్లో సినిమా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఇప్పుడు మళ్ళీ అదే పేరుతో సినిమా తీసాడు.
ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.అయితే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూ లు చేస్తూ బిజీగా ఉన్నాడు.
ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేసాడు.పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన సినిమా వకీల్ సాబ్.
ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని ప్రముఖులతో ప్రశంసలు అందుకుంటుంది.వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో పింక్ సినిమా రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.
మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత మంచి సందేశాత్మక సినిమాతో వచ్చాడు.
అయితే రామ్ గోపాల్ వర్మ పవన్ మీద కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.పవన్ సినిమాలలోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా నాకు చాలా ఇష్టం.వకీల్ సాబ్ నేను ఇంతవరకు చూడలేదు.
కానీ ట్రైలర్ చూసా బాగా నచ్చింది.కానీ ఆయన ఇమేజ్ కు తగ్గ సినిమాలు మాత్రం నేను చేయలేను.
ఒకవేళ నేను అలంటి హీరోతో సినిమా చేసిన వాళ్ళకే కాదు సినిమాకు కూడా మంచిది కాదు.నేను కమర్షియల్ సినిమాలకంటే జోనర్ సినిమాలు మాత్రమే ఎక్కువ చేస్తా.
అంటూ చెప్పుకొచ్చాడు.