కరోనా కట్టడి కోసం తెలంగాణ చీఫ్ సెక్రటరీ కీలక ఆదేశాలు..!!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి.దీంతో అక్కడి ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు బెడ్లు దొరకని పరిస్థితి.

 Telangana Chief Secretery Sensational Comments Telangana,somesh Kumar , Corona ,-TeluguStop.com

పరిస్థితి ఇలా ఉండగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కరోనా కట్టడి కోసం నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది.కరోనా వ్యాధిగ్రస్తులకు ఎక్కడా కూడా బెడ్ దొరకని పరిస్థితి ఉండకూడదని కరోనా బెడ్ల సంఖ్యను పెంచేలా నిర్ణయాలు తీసుకోవాలని ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రి అదేవిధంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పడకలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.కేసులు పెరిగిన గాని ఎక్కడా కూడా వైద్యం అందరి పరిస్థితి నెల కొనకూడదు అని సూచించారు.

ఎటువంటి పరిస్థితి అయినా వైద్యపరంగా ఎదుర్కొనే విధంగా అధికారులు అలర్ట్ గా ఉండాలని కరోనా నిర్ధారణ పరీక్షలు వీలైనంత వరకు పెంచేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.అంత మాత్రమే గాక వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం కూడా వేగవంతం చేయాలని కోరారు.

తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ కరోనా మాస్కులు ప్రజలు ధరించే విధంగా అన్ని జిల్లాలలో ప్రభుత్వ యంత్రాంగం గట్టిగా పని చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube