తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా కి రాష్ట్ర సిఐడి నోటీసులు జారీ చేసింది.ఇటీవల ప్రెస్ మీట్ లో మార్ఫింగ్ చేసి ముఖ్యమంత్రి జగన్ వీడియోలను ప్రదర్శించారని కర్నూలు వైసీపీ నేత నారాయణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు.
వెంటనే కర్నూలు సి ఐ డి కార్యాలయానికి రావాలని.ప్రెస్ మీట్ లో ప్రదర్శించిన వీడియోని కూడా తీసుకు రావాలని దేవినేని ఉమా కు నోటీసులు జారీ చేశారు.
దీంతో ఈ విషయంపై స్పందించిన దేవినేని ఉమా వైసీపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.తప్పుడు కేసులు పెడితే భయపడే ప్రసక్తి లేదని న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.
అక్రమ కేసులు పెట్టి ఇళ్లకు గోడలకి నోటీసులు అంటిస్తే భయపడే వారు ఎవరూ లేరని అన్నారు.తప్పుడు రాజకీయాలు… తప్పుడు కేసులు అక్రమంగా జైల్లో పెడితే భయపడే పరిస్థితి లేదు అంటూ సీఎం జగన్ ని ఉద్దేశించి దేవినేని ఉమ కౌంటర్ కామెంట్లు చేశారు.
ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తే టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మరింతగా పోరాటం చేయటం గ్యారెంటీ అని దేవినేని ఉమా సీరియస్ కామెంట్లు చేశారు.