ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ పుష్ప లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.
రవి శంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత బన్నీతో కొరటాల శివ తన దర్శకత్వంలో మరో సినిమా చేయాలనుకున్నారు.
కానీ ఈ విషయం గురించి ప్రకటించిన తర్వాత.ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తో.ఈ సినిమా విడుదల తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ తో మరో ప్రాజెక్టును చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు.పుష్ప సినిమా తర్వాత మరో పాన్ ఇండియా సినిమా బన్నీతో చేయాలనుకున్న కొరటాల శివ, ఎన్టీఆర్ తో మరో పాన్ ఇండియా సినిమాలు చేయనున్నాడు.
ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన కూడా చేశారు.,/br>
ఇక ఈ విషయం తెలుసుకున్న బన్నీ ఫాన్స్ తెగ మండిపడగా అభిమానులను దృష్టిలో పెట్టుకొని బన్నీ- కొరటాల నిర్మాతలు బన్నీ ఫాన్స్ కు ఓ విషయాన్ని తెలిపారు.అది కూడా బన్నీ తో కొరటాల దర్శకత్వం సినిమా త్వరలోనే చేయనున్నారని అంతేకాకుండా ఏప్రిల్ 2022 తర్వాత అని చెప్పడమే కాకుండా సినిమా గురించి అప్ డేట్స్ ఇస్తామని నిర్మాతలు ప్రకటించగా అప్పుడు బన్నీ ఫాన్స్ కాస్త కూల్ అయ్యారు.
కానీ ఇదంతా బన్నీ ఫాన్స్ ను కూల్ చేయడానికి తెలిపారన్న సంగతి బన్నీకి తెలియగా నిరుత్సాహం చెందాడు.
అంతేకాకుండా కొరటాల శివ తనతో కాకుండా ఎన్టీఆర్ తో ప్రాజెక్టు ఓకే అనేసరికి బన్నీ మరింత ఎక్కువగా హర్ట్ అయ్యాడని తెలుస్తుంది.ఇక అంతే కాకుండా బన్నీ పుష్ప తర్వాత కాస్త ఫ్రీ అయిపోతున్న సందర్భంలో కొరటాలతో సినిమా చేయాలని అనుకోగా ఎన్టీఆర్ తో ఒప్పుకోవడంతో బన్నీ తన మూవీ ని మరింత ఆలస్యం చేస్తున్నందుకు కొరటాల పై మండి పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.