టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బిజీగా ఉన్నారు.అంతే కాకుండా సినీ ఇండస్ట్రీలో ప్రభాస్ ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.
బాలీవుడ్ స్టార్ హీరోలను మించి తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.మొత్తానికి బాహుబలి సినిమా తర్వాత నే ప్రభాస్ ఇంత గుర్తింపు తెచ్చుకున్నాడని చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా వల్ల కాస్త అసంతృప్తి ఉన్నట్లు అనిపిస్తుంది.
ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న రాధేశ్యామ్ సినిమాల్లో బిజీగా ఉన్నారు.
ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఇక లవ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ ఏడాది విడుదల కానుందని సినీ బృందం తెలిపారు.
ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ మరో రెండు ప్రాజెక్టుల్లో నటించనున్నాడు.
నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపించగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆది పురుష్ సినిమాలో చేయనున్నాడు.అంతేకాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేయనున్నాడు.ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం బిజీగా ఉన్న రాధేశ్యామ్ షూటింగ్ పూర్తికావడానికి రాగ ఇందులో కొన్ని సీన్స్ చేయాల్సి ఉంది.
ఇక ఈ సీన్ లను సమయం దొరికినప్పుడు చేయాలని అనుకోగా ప్రస్తుతం ఈ సీన్ లను త్వరలో చేయాలనుకుంటున్నారని తెలిసింది.
ఇప్పుడు ఈ సినిమా సన్నివేశాలను ప్రారంభిస్తే ప్రస్తుతం గుజరాత్ లో ప్లాన్ చేసిన సలార్ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది.
ఒకవేళ ఇలా జరిగితే సినీ బృందానికి నష్టం కలిగినట్లే.అంతే కాకుండా ఈ రెండు సినిమాల ప్రభావం ఆది పురుష్ సినిమాపై కూడా పడుతున్నట్లు తాజా సమాచారం.
కాబట్టి ఈ కరోనా సమయంలో ఈ సినిమాలన్నీ రాధేశ్యాం సీన్ల వల్ల మరో సినిమాలు వాయిదా పడే అవకాశం ఉందన్న విషయం తో ప్రభాస్ అసంతృప్తి చెందినట్లు తెలుస్తుంది.