టెక్నాలజీ అభివృద్ధిలోకి వచ్చాక అనేక యాప్స్ పుట్టుకొచ్చాయి.ఇక ఇంటి దగ్గర ఉండే ఆర్డర్స్ పెడితే వాళ్లే మనకు కావాల్సినవి అన్ని ఇంటికే వచ్చేస్తున్నాయి.
ఇక ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ లో ఒక్కటి ఆర్డర్ పెడితే మరొక్కటి వస్తుంది.ఇక ఇలాంటి ఘటనలు మనం చాలానే చూస్తున్నాం.
ఇక ఆన్ లైన్ లో ఏదైనా ఆర్డర్ పెడితే ఇంటికి వచ్చే వరకు ఆ వస్తువు ఎలా ఉంటుందో.ఎలా వస్తదో అని వచ్చేవరకు మందిలో టెన్షన్ పడుతూనే ఉంటాము.
అంతేకాదు.ఆన్ లైన్ లో ఆర్డర్ చేయడం వలన మోసపోయిన వాళ్ళు చాల మంది ఉన్నారు.ఫోన్ ఆర్డర్ పెడితే దాని బదులు స్వీట్ బాక్స్ వచ్చింది.మరికొన్ని సార్లు ఫోన్ కి బదులు ఇటుక పెట్టిన పంపించిన రోజులు కూడా ఉన్నాయి.
ఇలా ఆన్ లైన్ ఆర్డర్ ద్వారా మోసపోయిన వాళ్ళు ఉన్నారు.ఇక తాజాగా కానీ బ్రిటన్లో జేమ్స్ అనే వ్యక్తిని అదృష్టం వరించింది.
అతను ఆన్లైన్ లో యాపిల్ పండ్ల ఆర్డర్ చేశాడు.కానీ ఆ వ్యక్తికీ యాపిల్స్ తో పాటు ఐఫోన్ కూడా వచ్చింది.ఇక ట్వికెన్ హామ్ లో ఉండే 50 ఏళ్ల జేమ్స్ ఆ ఐఫోన్ ను చూసి ఆశ్చర్యపోయాడు.ఇక ఈస్టర్ సందర్భంగా ఏదైనా ప్రాంక్ చేశారేమో అని అభిప్రాయపడ్డాడు.
కానీ టెస్కో మార్కెట్ కంపెనీ మాత్రం జేమ్స్ ను సర్ప్రైజ్ చేసింది.యాపిల్ పండ్లతో పాటు ఐఫోన్ స్పెషల్ ఎడిషన్ ఫోన్ ను గిఫ్ట్గా డెలివరీలో పంపింది.
టెస్కో గ్రోసరీ తన ప్రమోషనల్ క్యాంపేన్ లో భాగంగా యాపిల్ పండ్లతో పాటు ఐఫోన్ ను ఆ కస్టమర్ కు డెలివరీ చేసినట్టు తెలిపారు.సూపర్ సబ్స్టిట్యూట్ ఆఫర్ పేరుతో ఆ గిఫ్ట్ ఇచ్చారు.
యాపిల్ ఐఫోన్లు, ఎయిర్పాడ్స్తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా టెస్కో గిఫ్ట్గా ఇచ్చింది.