ఇప్పటికే కరోనా వల్ల భక్తులకు ఆలయదర్శనాల్లో చోటు చేసుకున్న ఎన్నో మార్పుల వల్ల పలు ఇబ్బందులు ఎదురవుతుండగా, కొన్ని పుణ్యక్షేత్రాల్లో అయితే కోవిడ్ విజృంభన వల్ల దర్శనాలు కూడా కలగడం లేదు.గత సంవత్సరం ఎక్కడికి వెల్లలేదని బాధపడుతున్న వారు కనీసం ఈ సంవత్సరం అయినా పుణ్యక్షేత్రాలను చూసివద్దామని భావించారు.
కానీ ఈ సంవత్సరం కూడా ప్రజలకు ఆ భాగ్యం ఉన్నట్లుగా కనిపించడం లేదు.ఇకపోతే ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన వారణాసిలో కూడా కరోనా వైరస్ ప్రభలుతున్న నేపధ్యంలో ఇక్కడికి రావొద్దని జిల్లా అధికారులు పర్యాటకులకు, భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అధికారులు ఏప్రిల్లో వారణాసిని సందర్శించాలని ప్లాన్ చేసుకున్న స్వదేశీ, విదేశీ పర్యాటకులు తమ ట్రిప్ను రద్దు చేసుకోవాలని కోరుతున్నారు.ఇదిలా ఉండగా గతనెల 31 న వారణాసిలో 116 కేసులు నమోదు కాగా ఏప్రిల్ 5 నాటికి అవి 550 కి పెరిగాయి.
ఇక బుధవారం వారణాసిలో 1,585 మందికి పాజిటివ్ తేలింది.గడిచిన రెండు వారాల్లోనే కొవిడ్ కేసులు భారీగా పెరగడం ఆందోళనకు గురిచేస్తున్నదని అధికారులు వివరించారు.ఇక ప్రస్తుతం వారణాసిలో 10,206 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొన్నారు.