దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.రోజుల వ్యవధిలోనే రోజుకి కొత్త పాజిటివ్ కేసులు లక్షల్లో మొన్నటివరకు బయటపడగా, తాజాగా రెండు లక్షల కొత్త పాజిటివ్ కేసులు బయటపడటం సంచలనం రేపుతోంది.
ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా భారీగా విజృంభిస్తోంది.దేశంలో సగానికి పైగా కేసులు మహారాష్ట్రలోనే బయటపడటంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి వరకు రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తూ వీకెండ్ లో లాక్ డౌన్ విధించడం జరిగింది.
అయినా గాని పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఇప్పుడు మహారాష్ట్ర పూర్తి లాక్ డౌన్ లో ఉండటం మాత్రమే కాక 144 సెక్షన్ అమలులో ఉంది.ఇదిలా ఉంటే కేసులు భారీగా బయటపడుతూ ఉండటంతో ఆ రాష్ట్రంలో హాస్పిటల్స్ లో కరోనా పేషెంట్ లకు బెడ్ లు తక్కువ కావడంతో అక్కడి ప్రభుత్వం మహారాష్ట్రలో స్టార్ హోటల్స్ ని కరోనా హాస్పిటల్స్ గా మార్చేశాయి.
స్వల్ప లక్షణాలు కలిగిన వారిని పెద్దగా అత్యవసర చికిత్స లేని వారిని స్టార్ హోటల్స్ లో పెట్టి చికిత్స అందిస్తున్నారు.మహారాష్ట్రలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది.
ఎక్కడికక్కడ హాస్పిటల్స్ లో కరోనా పేషంట్ లతో నిండి పోతూ ఉండటం తో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ కరోనా కట్టడికి ముందడుగు వేస్తుంది.