కేంద్రం పై ఇప్పటికే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేస్తుండగా, తాజాగా కాంగ్రెస్ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ పై మండిపడుతున్నారు.పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఉత్తర్ దినాజ్పూర్లో జరిగిన ప్రచార సభలో పాల్గొన్నా సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.
పదే పదే ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అని పిలుపునిచ్చే బీజేపీ ‘తృణమూల్ ముక్త్ భారత్’ అని ఎప్పుడూ అనలేదేం అంటూ ప్రశ్నించారు.
కాగా మమతా, బీజేపీ మాజీ మిత్రులని, అందుకే ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ పోరే గానీ సిద్ధాంత పరంగా ఒకటేనని విమర్శించారు.
ఇకపోతే బెంగాల్లో మమతా బెనర్జీ రోడ్లు నిర్మించారా, కాలేజీలు కట్టారా, చివరికి విద్యార్థులకు ఉద్యోగాలు లేవు.ఉద్యోగం రావాలంటే లంచాలు ఇచ్చుకోవాల్సిందని ఎద్దేవా చేస్తూ, మీరు టీఎంసీకి రెండు సార్లు అవకాశమిచ్చిన మీ అంచనాలను అందుకోవడంలో టీఎంసీ దారుణంగా విఫలమైందని, ఈ పదేళ్లలో మమతా బెనర్జీ బెంగాల్కు చేసింది ఏమీ లేదని ఆరోపించారు.
ఇక బీజేపీ పై మండిపడుతూ కరోనా కట్టడి లో ప్రధాని దారుణంగా విఫలమయ్యారని విమర్శించారు రాహుల్.