కరోనా మనుషులు చేస్తున్న ప్రతి పనికి అడ్డుగా ఉంటున్న విషయం తెలిసిందే.ఎక్కడికి వెళ్లాలన్న కరోనా భయం వెంటాడుతుంది.
అలాగని ప్రజలు భయపడి ఇంట్లో కూర్చుంటున్నారా అంటే అదీలేదు.ఇక ఐపీఎల్ స్టార్ట్ అయ్యింది కదా క్రికెట్ అభిమానులకైతే పండగాలా ఉంది.
కానీ ఈ ఐపీఎల్ ను కూడా కరోనా వదలడం లేదు.
ఈ క్రమంలో ఐపీఎల్ ల్లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.
దక్షిణాఫ్రికాకు చెందిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలర్ యాన్రిచ్ నోర్జేకు నిర్వహించిన తొలి ఆర్టీ–పీసీఆర్ టెస్టులో కరోనా పాజిటివ్ వచ్చింది.కాగా నిన్న నిర్వహించిన రెండో ఆర్టీ–పీసీఆర్ టెస్టు ఫలితం ఇంకా రాలేదు.
కాబట్టి రాజస్తాన్ రాయల్స్తో గురువారం జరిగే మ్యాచ్కు నోర్జే దూరం కానున్నాడని సమాచారం.
ఇదిలా ఉండగా ఈ క్రికెటర్కు కోవిడ్ పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.ఇదిలా ఉండగా ఈనెల 6న నోర్జేతో కలిసి వచ్చిన మరో బౌలర్ కగిసో రబడకు కూడా నెగెటివ్ వచ్చింది.ఇక ఇప్పటికే అక్షర్ పటేల్ (ఢిల్లీ క్యాపిటల్స్), దేవ్దత్ పడిక్కల్, డానియల్ సామ్స్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) వీరు కూడా ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కరోనా బారిన పడ్డవిషయం తెలిసిందే.